రవితేజ నటించిన విక్రమార్కుడు, కిక్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యి ఎంతటి విజాయాన్ని అందుకున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నేరుగా ఆయనే బాలీవుడ్ తెరకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా పరిచయం కానున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో రవితేజ బిజీబిజీగా గడిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఎక్కువగా పెరిగింది నార్త్లోనే. అమితాబ్ అభిమానిని. ఆయన్ను చూస్తూ ఎదిగాను. నా ‘విక్రమార్కుడు’ ‘రౌడీరాథోడ్’గా, నా ‘కిక్’ అదే పేరుతో ఇక్కడ రీమేక్ అయి విజయాలను అందుకున్నాయి.
అప్పుడు ప్రౌడ్గా ఫీలయ్యాను. ఇప్పుడు రీమేక్ల ట్రెండ్కి కాలం చెల్లింది. ఇది పాన్ ఇండియా యుగం. అన్ని భాషల సినిమాలనూ అందరం చూస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా నా సినిమా బాలీవుడ్లో విడుదల అవుతుండటం చెప్పలేని ఆనందంగా ఉంది.’ అన్నారు. ఇంకా చెబుతూ ‘నేను యాక్షన్ సినిమాలకు అభిమానిని. ఆ తరహా చిత్రాలకు ట్రెండ్తో పనిలేదు. బాగా తీస్తే ఎప్పడూ చూస్తారు. ‘టైగర్ నాగేశ్వరరావు’లో యాక్షన్ పీక్స్లో ఉంటుంది. ఈ సినిమా అన్ని భాషల్లో విజయం సాదించడం పక్కా’ అంటూ నమ్మకం వ్యక్తం చేశారు రవితేజ.