దక్షిణాది ఇండస్ట్రీలో సాయిపల్లవి పంథా చాలా ప్రత్యేకం. కథాంశాల ఎంపికలో కొత్తదనంతో పాటు తన పాత్రల్లో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ వరుసగా పాన్ ఇండియా చిత్రాలను అంగీకరిస్తున్నది. రణ్బీర్ కపూర్ హీరోగా నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ ఇతివృత్తంతో తెరకెక్కనున్న చిత్రంలో సాయిపల్లవి సీత పాత్రను పోషించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే నాగచైతన్య తొలి పాన్ ఇండియా చిత్రం ‘తండేల్’లో కూడా ఆమే కథానాయికగా నటిస్తున్నది.
ఈ నేపథ్యంలో సాయిపల్లవి మరో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా ఎంపికైనట్లు తెలిసింది. ‘కేజీఎఫ్’ సిరీస్ వంటి భారీ విజయాల తర్వాత కన్నడ అగ్ర నటుడు యష్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా అప్డేట్ ఈ నెల 8న రానుంది.. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాయికగా సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలిసింది.