మిస్ అండ్ మిస్టర్ ఇండియా పోటీలను జాతీయస్థాయిలో నిర్వహిస్తామని వింగ్స్ మోడల్ హబ్ తెలిపింది. గతంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ పోటీలను పాన్ ఇండియాకు తీసుకువెళ్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వివరాలు వెల్లడించేందుకు ఇటీవల హైదరాబాద్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యనటులు హైపర్ ఆది, మహేష్, హీరోయిన్ చాందినీ తదితరులు పాల్గొన్నారు. మిస్ ఇండియా మిస్టర్ ఇండియా పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ..‘మోడలింగ్లో రాణించాలనుకునే యువతీ యువకులకు మా కాంటెస్ట్ ద్వారా అవకాశాలు కల్పిస్తాం’. అన్నారు.