న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. ఆదివారం కేసుల నమోదు అన్నిరికార్డులను బ్రేక్ చేసింది. తొలిసారి అత్యధికంగా పది వేలకుపైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 10,774 కరోనా కేసులు, 48 మరణాలు రికార్డయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,25,197కు, మరణాల సంఖ్య 11,283కు పెరిగింది. గత 24 గంటల్లో 5,158 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి మొత్తం సంఖ్య 6,79,573కు చేరిందని, రికవరీ రేటు 93.7 శాతమని ఢిల్లీ ఆరోగ్యశాఖ తెలిపింది.