న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజకీయ నేత రాఘవ్ చద్దా (Parineeti Chopra-Raghav Chadha)వివాహం ఆదివారం అట్టహాసంగా జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను పరిణీతి తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేయగా అవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ జంట వివాహ వేడుకకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, డిజైనర్ మనీష్ మల్హోత్రా, క్రికెటర్ హర్బజన్ సింగ్ ఆయన భార్య గీతా బస్రా సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
పరిణీతి కజిన్ ప్రియాంక చోప్రా ఈ వేడుకకు హాజరు కాలేదు. ఇక అత్యంత ఆహ్లాదంగా, భారీ ఖర్చుతో వివాహ వేదికను సిద్ధం చేయడం అతిధులను ఆకట్టుకుంది. వివాహ వేడుకలో విందు సైతం అదరహో అనిపించింది. మెహెందీ వేడుకలో ఇండియన్, ఇటాలియన్, ఆసియన్ వంటకాలను వడ్డించారు.
పెండ్లి రోజు విందులో ప్రధానంగా పంజాబీ రుచులతో పాటు రాజస్ధానీ సంప్రదాయ వంటకాలు అతిధులను ఊరించాయి. స్వతహాగా పరిణీతి చోప్రా సోదరులు సహజ్ చోప్రా, శివంగ్ చోప్రా ఫుడ్ ఎంట్రప్రెన్యూర్లు కావడంతో సోదరి వివాహానికి ప్రత్యేక శ్రద్ధతో మెనూని రూపొందించారు. బాలీవుడ్ సంగీత్ నైట్లో క్లాసిక్ స్ట్రీట్ ఫుడ్స్, రబ్రి, జలేబి, మ్యాగి, పానీపూరి వంటి డెజెర్ట్స్ అతిధుల కోసం ఏర్పాటు చేశారు.
Read More :