Manchu Vishnu | తెలుగు సినీ పరిశ్రమ 90 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలోనే ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు టాలీవుడ్ నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) తెలిపారు.
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను జులైలో మలేషియాలో నిర్వహిస్తామని, పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామని తెలిపాడు. ఇక ఈ వేడుకల సందర్భంగా జులైలో షూటింగ్లకు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరామని, సెలవుపై ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు సానుకూలంగా స్పందించారని విష్ణు పేర్కొన్నారు. దేశంలోని ఐదు అసోషియేషన్లతో ‘మా’ ఒప్పందం చేసుకుందని, తెలుగు చిత్ర పరిశ్రమ ఘనకీర్తిని చాటిచెప్పేందుకు వేడుకలు నిర్వహిస్తున్నామని, చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. కీరవాణి గారు ఆస్కార్ అందుకున్నారు. అల్లు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చింది. తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ సమయంలో ఇలాంటి ఉత్సవం చేయడం కరెక్ట్ అనిపించిందంటూ మంచు విష్ణు వెల్లడించారు.
#ManchuVishnu about the Greatness of Telugu Actors
He’s planning Navatihi utsavam in July 2024 for 2 days (association with the Malaysian government) to celebrate 90 years of Telugu cinema
All the actors including senior and star heroes will be present#Chiranjeevi… pic.twitter.com/XVQ39z6VEo
— Daily Culture (@DailyCultureYT) March 23, 2024