టాలీవుడ్ (Tollywood) హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) తండ్రి కావలి శ్యామ్ సిద్దార్థ్ (Shyam Siddharth) అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తండ్రి మృతితో నిఖిల్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తన తండ్రికి బావోద్వేగపూరిత క్షణాలతో వీడ్కోలు పలుకుతూ..ఓ సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నిఖిల్.
‘డాడీ..మీరు ఎక్కడ ఉన్నా శాంతిని పొందుతారని ఆశిస్తున్నా.. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ సినిమా, బిర్యానీ కోసం షికార్లు చేసిన క్షణాలు, ప్రయాణం, నవ్వులు, ముంబైలో వేసవి.. అన్నీ మిస్ అవుతున్నాం. నీ కుమారుడైనందుకు నేనెప్పుడూ గర్వపడుతా. మనం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా నాన్న..’అంటూ సందేశాన్ని పోస్ట్ చేశాడు. ‘నాన్న మంచి వ్యక్తి. జేఎన్టీయూ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ స్టేట్ టాపర్’ అని పోస్ట్లో రాసుకొచ్చాడు నిఖిల్.
లెజెండరీ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్లకు వీరాభిమాని శ్యామ్ సిద్దార్థ్. తన కొడుకు నిఖిల్ను ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకునేవాడు. శ్యామ్ సిద్దార్థ్ 8 ఏండ్లుగా కార్టికో బాసల్ డీజనరేషన్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుండగా..కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Devastated that My father Shyam Siddhartha Passed away yesterday.
Hope U find peace wherever you r Daddy..We Love u..
Our RTC Xroad movie and Biryani Outings, Travel,laughter, Summers in Mumbai.. will miss them all.
I am always proud to be Your son. Hope we meet again daddy🙏🏽 pic.twitter.com/vVsJOL6ad1— Nikhil Siddhartha (@actor_Nikhil) April 29, 2022
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు