కరోనా పాండమిక్ ప్రపంచాన్ని ఎన్ని కష్టాలకు గురిచేసిందో చూశాం. ఆ కష్టాలకు తెరరూపమిస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నది బాలీవుడ్ తార రిచా చద్దా. కరోనా రోగులకు చికిత్స అందించడంలో ప్రాణాలకు తెగించి సేవలందించారు వైద్య సిబ్బంది. వైద్యులు, నర్సులు చేసిన సేవలు మరవలేనివి. అలాంటి ఓ నర్సు పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నది రిచా. ఈ చిత్రానికి అభిషేక్ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నది.
ఈ సినిమా గురించి రిచా చద్దా మాట్లాడుతూ…‘కరోనా సమయంలో మనమెంతో నష్టపోయాం, నిరాశలో కూరుకుపోయాం. మనుషులుగా ఉన్నందుకే భయపడ్డాం. రేపటి గురించి తలుచుకుని వణికిపోయాం. అయినా కొందరి ధైర్యం, సేవాగుణం మనలో ఆశలను బతికించాయి. సోషల్ మీడియాలో పోస్టులకు స్పందించి ఎంతోమంది సహాయం అందించారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది ప్రాణాలు ఒడ్డి రోగులకు చికిత్స చేశారు. అలాంటి ఓ గొప్ప నర్సు పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నా. ఆమె ధైర్య సాహసాలు ఆకట్టుకుంటాయి. సెకండ్ వేవ్ నేపథ్యంతో ఈ సినిమా వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ తెరకెక్కిస్తున్నాం’ అని చెప్పింది.
న్నారు.