Vyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలకు మొదట సెన్సార్ (Censor Board) అడ్డంకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు (High Court) సూచనలతో రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును జారీ చేయడంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. మొదటి పార్ట్ ‘వ్యూహం’ సినిమాను ఈ నెల 23న విడుదల చేయనుండగా.. రెండో పార్ట్ ‘శపథం’ ను మార్చి 01న విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించాడు. ఇక ఈ రెండు సినిమా తేదీలు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లను ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇక తొలిపార్టు ‘వ్యూహం’లో YSR మరణం తర్వాత ఏం జరిగిందని.. రెండో పార్ట్లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్తో రామ్గోపాల్ వర్మ ఈ రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన వ్యూహం టీజర్కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు విమర్శలు కూడా తలెత్తాయి.
VYOOHAM and SHAPADHAM trailer release 5 pm today 💪💪💪🔥🔥🔥 pic.twitter.com/8FImazsAJW
— Ram Gopal Varma (@RGVzoomin) February 13, 2024