Vishwambhara Movie | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏండ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం రెండు పాటలు, క్లైమాక్స్ షూట్ మిగిలిఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది చిత్రబృందం. అయితే తాజాగా ఈ సినిమా టీజర్కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్ను మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఆగష్టు 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్కు ఇంతకంటే పెద్ద గిప్ట్ లేదని చెప్పవచ్చు. కాగా దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది.
ఈ చిత్రం రెండు పార్టులుగా రానున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్లో త్రిష కథానాయికగా ఉండగా.. రెండో భాగంలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి ఖుష్బూ నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మొదటగా హీరోయిన్ విజయశాంతిని సంప్రదించగా.. రాములమ్మ ఒకే చెప్పలేదని టాక్ నడిచింది. ఆ తర్వాత ఖుష్బూని సంపద్రించగా కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేశారనీ తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆరు పాటలుంటాయని ఎంఎం కీరవాణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
Also Read..