Gangs of Godavari | విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘1960దశకంలో గోదావరి జిల్లాల్లో చీకటి ప్రపంచం నుంచి ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. లంకల రత్న అనే గ్యాంగ్స్టర్ పాత్రలో విశ్వక్సేన్ కనిపిస్తారు.
మునుపెన్నడూ చూడని రీతిలో ఆయన పాత్ర సాగుతుంది. విశ్వక్సేన్ సరికొత్త మేకోవర్లో కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన లభించింది. 1960 దశకం నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తూ ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. నేహాశెట్టి, అంజలి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిత్ మాదాడి, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, దర్శకత్వం: కృష్ణచైతన్య.