Vishal in Saamanyudu | కొన్ని రోజులుగా బయట ఉన్న పరిస్థితులు చూసి సినిమాలు విడుదల చేయదానికి నిర్మాతలు భయపడుతున్నారు. కానీ ఎవరో ఒకరు ధైర్యం చేసి విడుదల చేస్తే కానీ మిగిలిన వాళ్లకు అది దారి చూపించదు. సంక్రాంతి తర్వాత మళ్లీ ఇప్పటి వరకు పేరున్న సినిమా ఒక్కటి కూడా రాలేదు. మొన్న జనవరి 28న కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన గుడ్ లక్ సఖి వచ్చినా కూడా కనీసం ఆ సినిమా వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇలాంటి సమయంలో మాస్ యాక్షన్ హీరో విశాల్ తన సామాన్యుడు సినిమాను ఫిబ్రవరి 4న థియేటర్స్లో విడుదల చేస్తున్నాడు.
సామాన్యుడు సినిమాకు నిర్మాత కూడా విశాల్నే. అందుకే లెక్కలు బేరీజు వేసుకొని సినిమాను థియేటర్స్లో దించుతున్నాడు. దర్శకుడు శరవణన్ ఈ సినిమాను క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విశాల్ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. పేరుకు తమిళ హీరో అయినా కూడా తెలుగబ్బాయి కావడంతో మన ప్రేక్షకులు ఈయనను బాగానే ఆదరిస్తారు. సినిమా కాస్త బాగుంది అంటే చాలు కచ్చితంగా కలెక్షన్స్ కూడా వస్తాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విడుదల చేయడమనేది సాహసంతో కూడిన నిర్ణయం. అయితే విశాల్ మాత్రం తన సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాడు.
అందుకే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కేవలం ప్రేక్షకుల మీద నమ్మకంతో సామాన్యుడు సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాడు. ఈ సినిమా తీసుకొచ్చే కలెక్షన్స్ పైనే రాబోయే సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఫిబ్రవరి 11న రవితేజ ఖిలాడి సినిమా విడుదల కానుంది. మొత్తానికి సంక్రాంతి తర్వాత సీజన్ కు సామాన్యుడు సినిమాతో విశాల్ ముహూర్తం పెడుతున్నాడు. మరి ఇది ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
రచయితగా మారనున్న ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్..
కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న అనసూయ భరద్వాజ్..
చిరంజీవికి పోటీగా వస్తున్న వరుణ్ తేజ్..
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు