chiranjeei varuntej | దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగడంతో సంక్రాంతికి రావాల్సిన చాలా పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. సంక్రాంతికే కాదు ఫిబ్రవరిలో రావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇప్పుడు కేసులు కాస్త తగ్గుముఖం పడుతుండటంతో అన్ని సినిమాలు సమ్మర్కు రావాలని ప్లాన్ చేస్తున్నాయి. ఒక్కొక్కరుగా తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు టెన్షన్ పట్టుకుంది.
అదేంటి మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంటే వరణ్తేజ్కు ఎందుకు టెన్షన్ అని అనుకుంటున్నారా? వరుణ్ తేజ్, వెంకటేశ్ నటించిన ఎఫ్ 2 సినిమా సీక్వెల్ ఎఫ్ 3 సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా వచ్చిన మరుసటి రోజే మెగాస్టార్ రాబోతున్నాడు. దీంతో ఎఫ్ 3 సినిమా కలెక్షన్లపై భారీగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీంతో వరుణ్తేజ్ కాస్త భయపడిపోతున్నాడు. గతంలో ఎఫ్ 2 సినిమా కూడా అన్నయ్య రామ్చరణ్కు పోటీగా విడుదలైంది. 2019 సంక్రాంతికి ఎఫ్ 2, వినయ విధేయ రామ సినిమాలు విడుదలయ్యాయి. కానీ అప్పుడు వినయ విధేయ రామ యావరేజ్గా నిలిచింది. వరుణ్ తేజ్ మాత్రం బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా రామ్చరణ్కు పోటీగా వరుణ్ తేజ్ వస్తున్నాడు. కానీ ఈసారి అక్కడ పెద్దనాన్న చిరంజీవి కూడా ఉన్నాడు. మరి మెగాస్టార్ చిరంజీవి సినిమాను తట్టుకుని ఎఫ్ 3 నిలబడుతుందా? లేదా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. దీంతో మెగాస్టార్కు పోటీగా ఎఫ్3ని విడుదల చేస్తారా? లలేదా మరో తేదీని చూసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.