తన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం బోర్డు సభ్యులు 6.5లక్షల లంచం తీసుకున్నారని హీరో విశాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. సెన్సార్ బోర్డ్లో జరిగే అవినీతికి సంబంధించి ప్రొడ్యూసర్ గిల్డ్, మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ తమకు సమాచారం అందించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
‘విశాల్కు ఎదురైన సంఘటన చాలా దురదృష్టకరమైనదిగా భావిస్తున్నాం. అవినీతిని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఈ విషయంపై విచారణ చేస్తారు’ అని ప్రభుత్వం ట్విట్టర్లో పేర్కొంది.