ఇటీవల ‘మధ గజ రాజా’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో విశాల్. ఈ నేపథ్యంలో ఆయన 35వ చిత్రం సోమవారం చెన్నైలో ప్రారంభమైంది. సూపర్గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి అరసు దర్శకుడు.
దుషార విజయన్ కథానాయికగా నటిస్తున్నది. 45రోజుల పాటు సాగే సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేస్తామని, యాక్షన్ ప్రధాన కథాంశంతో తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎం నాథన్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, దర్శకత్వం: రవి అరసు.