Jithender Reddy | ఉయ్యాల జంపాల (Uyyala Jampala ) సినిమాతో డైరెక్టర్గా సూపర్ ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ (Virinchi Varma). విలేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత నానితో కలిసి మజ్ను (Majnu 2016) తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు విరించి వర్మ. సుమారు ఏడేండ్ల విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టాడు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్తో హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో మూవీ నుంచి మేకర్స్ టైటిల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ టైటిల్ను ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) అని ఫిక్స్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనితో పాటు ఒక పోస్టర్ను కూడా వదిలారు. ఒక నాయకుడు ప్రజల కష్టాలు వింటున్నట్లు ఈ పోస్టర్ ఉంది. అయితే ఈ సినిమా కోసం పనిచేస్తున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని తాజా సమాచారం. ముడుగంటి క్రియేషన్స్ డెబ్యూ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి పాపులర్ మలయాళీ కంపోజర్ గోపీ సుందర్ సంగీతం అందించనున్నాడు.
Looks very exciting and looking forward to see this story!! Wishing all the very best to “Uyyala Jampala” & “Majnu” fame @virinchivarma on his next #JithenderReddy All the very best to our “Baba” @gnanashekarvs @ravinderReddyIN@Muduganti_Offl @GopiSundarOffl 🤗🤗🤗
More details… pic.twitter.com/KlMYgCyryB— deva katta (@devakatta) September 9, 2023