నీది నాది ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు ఊడుగుల (Venu Udugula). కొత్తదనంతో కూడిన కథాంశాలను ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ యువ డైరెక్టర్ ప్రస్తుతం తెలంగాణలో నక్సలిజం (Telangana Naxalism backdrop) బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్న సినిమా విరాటపర్వం (Virataparvam).
రానా (Rana Daggubati), సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే లాక్డౌన్ కారణంగా చాలా కాలంగా ఆలస్యమవుతూ వస్తున్న విరాటపర్వం థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయంటూ ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. విరాటపర్వం నెట్ఫ్లిక్స్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
థియేటర్ల వ్యవస్థ ట్రాక్లోకి వచ్చిన తర్వాత కూడా విరాటపర్వం ఓటీటీ వైపు ఎందుకు వెళ్తుందనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. విరాటపర్వంలో కొన్ని చోట్ల వాడిన భాషకు అందరూ కనెక్ట్ అవరని, తెలియని పదాలను వేగంగా పలికించడం కూడా అర్థం చేసుకోవడంలోప్రేక్షకులు ఇబ్బంది పడతారని నిర్మాత సురేశ్ బాబు (Suresh Babu) భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే ఆ సీన్లను రీషూట్ చేయాల్సి రావడం, రీ షూట్ చేయాలంటే డబ్బులు కూడా బాగానే ఖర్చయే అవకాశాలుండటంతో ఇక ఈ చిత్రాన్ని అలానే ఓటీటీలో విడుదల చేస్తే నష్టాలు రాకుండా ఉంటాయని సురేశ్ బాబు డైరెక్టర్ వేణుకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి విరాటపర్వం థియేటర్లలోకి వస్తుందా…? ఓటీటీనా అనేది చూడాలి..?
విరాటపర్వం టీజర్పై ఓ లుక్కేయండి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!