వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. పవన్తో కలిసి రానా చేస్తున్న ఈ చిత్రం మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతుంది.ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ మరి కొద్ది రోజులలో మొదలు కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది .చిత్రంలో ప్రముఖ స్టార్ దర్శకుడు వివి వినాయక్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారట. వినాయక్ రోల్ పవన్ తో పాటు సాలిడ్ రోల్ చేస్తున్న రానాకు దగ్గరగా ఉండేదిలా కనిపిస్తుందట. వినాయక్ దర్శకుడిగానే కాదు నటుడిగాను రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా నటించిన శీనయ్య త్వరలోనే విడుదల కానుంది.