కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay )ప్రస్తుతం వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్వకత్వంలో వారసుడు సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా నుంచి తొలి పాట దీపావళికి విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది.కాగా ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. రంజితమే ఏ రంజితమే (Ranjithame Ye Ranjithame) అంటూ ఈ పాట సాగనుండగా.. విజయ్ కూడా గొంతు కలపబోతున్నాడట.
పాపులర్ గాయని జోనితా గాంధీ పాటను పాడనుండగా.. విజయ్ ఆమెతో కలిసి వాయిస్ ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మరి దీపావళికి విడుదలయ్యే పాట ఇదేనా..? కాదా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. వారసుడు చిత్రంలో జయసుధ, ప్రకాశ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నది. దర్శకుడు వంశీ పైడిపల్లితోపాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు.
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్కు సంబురాలే..!