కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న చిత్రం వారసుడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తమిళంలో వారిసు టైటిల్తో వస్తోంది. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
వారసుడు కర్ణాటక (కన్నడ) హక్కులు రూ.9 కోట్లు పలికాయన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. స్వాగత్ ఎంటర్ప్రైజెస్ వారసుడు ప్రాంతీయ హక్కులను సొంతం చేసుకోగా.. కర్ణాటకలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నట్టు సమాచారం. బీస్ట్తో డిజాస్టర్ మూటగట్టుకున్న విజయ్ వారసుడు సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.
సంక్రాంతి బరిలో స్ట్రైయిట్ తెలుగు సినిమాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించిన నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లో వారసుడు సినిమా అనుకున్న సమయానికే విడుదల అవుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రంజితమే సాంగ్ యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా వారసుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారసుడు మూవీకి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also : Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్