టాలీవుడ్ నుంచి త్వరలో సందడి చేయబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్ (Liger). పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్ట్ చేస్తున్న లైగర్ లో విజయ్దేవరకొండ (Vijay Deverakonda) టైటిల్ రోల్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటరైన విజయ్ ఈ సారి లైగర్తో తన రేంజ్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు.
ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో లైగర్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. షెడ్యూల్ ప్రకారం ప్రాంతాల వారీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది విజయ్ టీం. విజయ్ దేవర కొండ గుజరాత్లో తన ఫాలోవర్లు, అభిమానులను కలువబోతున్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం విజయ్ అండ్ లైగర్ బృందం ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు అహ్మదాబాద్లోని వేద్ ఆర్కెడ్ మాల్లో అభిమానులను కలువనుంది.
అదేవిధంగా టీం మెంబర్స్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు వడోదరాలోని పారుల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, గ్లింప్స్ వీడియో, ట్రైలర్తో అంచనాలు పెంచేశాడు విజయ్. బాలీవుడ్ భామ అనన్యపాండే (Ananya Pandey) లైగర్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.
ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. లైగర్ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
GUJARAT ! અમે આવીએ છીએ ♥️#Liger is coming to roar in your city!🔥
🗓️ Today, 5:30PM
📍VED Arcade Mall, Ahmedabad🗓️ Tomorrow, 3PM
📍Parul University, Vadodara#LigerOnAug25th@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 pic.twitter.com/3vFFyUjWkM— Dharma Productions (@DharmaMovies) August 7, 2022