Vijay Deverakonda | టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లోని సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత కాస్త విరామం తీసుకున్న ఆయన తాజాగా.. బారాముల్లా నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉరి సెక్టార్ను సందర్శించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారత సైనికులను కలుసుకున్నారు. వారితో సరదాగా సమయం గడిపారు. అక్కడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి, తుపాకీ చేతపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరల్గా మారాయి.
‘లైగర్’ సినిమా తర్వాత విజయ్ తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ చేయాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. అయితే, ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన ‘లైగర్’ సినిమా డిజాస్టర్గా నిలిచింది. దీంతో తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ను ఆపేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా విజయ్ షేర్ చేసిన ఫొటోలతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్లైంది. వీటిని చూసిన అభిమానులు … జనగణమన కోసమే విజయ్ జవాన్లను కలిశారంటూ కామెంట్లు పెడుతున్నారు.
వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సహకారంతో ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్కు జోడీగా పూజా హెగ్దే కనిపించనున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
With the Baddest Men on the Indian front lines!#URI pic.twitter.com/enmckJQpoT
— Vijay Deverakonda (@TheDeverakonda) October 15, 2022