టాలీవుడ్ లో ముక్కుసూటిగా మొహమాటం లేకుండా మాట్లాడే యాక్టర్లకు కొదవేమి లేదు. అయితే కొన్ని సార్లు యాక్టర్లు చేసిన కామెంట్స్ రాంగ్ డైమెన్షన్లో వెళ్తుంటాయి. ఎవరినీ ఉద్దేశించి మాట్లాడకుండా తమకనిపించింది చెప్పేయడం కొన్ని సార్లు టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతుంది. అలాంటిదే స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విషయంలో కూడా జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ..లైగర్ను ఎవరు ఆపుతారో చూస్తానని అన్నాడు విజయ్.
అయితే దీనిపై పాపులర్ మరాఠా మందిర్ సినిమా (ముంబై) యజమాని మనోజ్ దేశాయ్ (Manoj Desai) స్పందిస్తూ..విజయ్ దేవరకొండను (Arrogant) యారోగెంట్ (అహంభావి)గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తన మాటలను అపార్థం చేసుకున్న మనోజ్ దేశాయ్ను కలిసేందుకు విజయ్ ముంబైకి పయనమయ్యాడట. తన మాటలపై మనోజ్ దేశాయ్కు విజయ్ క్లారిటీ కూడా ఇచ్చాడని ఇన్సైడ్ టాక్.
అంతేకాదు రాబోయే రోజుల్లో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని మనోజ్ దేశాయ్కు విజయ్ హామీనిచ్చాడన్న వార్త ఇపుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. మొత్తానికి కామెంట్స్ మాటెలా ఉన్నా ..తాజా అప్డేట్తో అందరినీ కలుపుకుని పోవాలన్న విజయ్ దేవరకొండ ఆలోచనకు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్, మూవీ లవర్స్.