VijayDeverakonda | రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాతి వేడుకలను మరింత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నూతన దంపతులు ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తుంది. ఈ భేటీ పెళ్లికి ముందే జరుగగా.. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది విజయ్ టీమ్.
పెళ్లికి ముందు ప్రధానిని కలిసిన ఈ జంట ఆయన ఆశీస్సులు తీసుకోవడమే కాకుండా, మార్చి 4న హైదరాబాద్లోని ఐకానిక్ ‘తాజ్ కృష్ణ’ హోటల్లో జరగనున్న తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్డును స్వయంగా అందజేసి ఆహ్వానించారు. సినీ, రాజకీయ మరియు క్రీడా రంగాలకు చెందిన దిగ్గజాలు ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు.