Pelli Choopulu | విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెళ్ళి చూపులు’. రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్గా నటించింది. 2016లో జూలై 29న ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం (Pelli Choopulu) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలోని ‘నా సావు నేను సస్తా’ అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రానికి ‘బెస్ట్ తెలుగు ఫిలిం’ మరియు ‘బెస్ట్ స్క్రీన్ ప్లే’ కేటగిరీల్లో రెండు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండకు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మంచి ఎంట్రీ దొరికింది. అయితే ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఎప్పుడు మూవీ వస్తుందా అని సినీ లవర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో వచ్చే క్రేజీ ప్రాజెక్ట్పై ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola ). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ కీడా కోలా టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అనంతరం తరుణ్ భాస్కర్ కాంబోలో వచ్చే తన నెక్స్ట్ మూవీపై మాట్లాడుతూ.. తాజాగా తరుణ్ నాకో కథ చెప్పాడు. అది ఒకే కూడా అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని విజయ్ తెలిపాడు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kekaa 💥 pic.twitter.com/ptvKr6563C
— R R (@RacchaRidhvik) October 29, 2023