విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం కొద్ది రోజుల కిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ-పరశురామ్ కలయికలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తాలూకు తాజా అప్డేట్ వెలువడింది.
ఆదివారం రోజున రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టామని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నది. ‘గీత గోవిందం’ తరహాలోనే చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘ఫ్యామిలీమ్యాన్’ అనే టైటిల్ను ఖరారు చేయబోతున్నట్లు సోషల్మీడియాలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు.