vijay devarakonda chief guest for romantic movie | పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ), మహేశ్ బాబు ( mahesh babu ), అల్లు అర్జున్ ( allu arjun ), రవితేజ ( raviteja ) ఇలా ఎంతో మంది హీరోలకు మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఎంతో మందికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరీ.. తన కొడుకు ఆకాశ్ పూరీకి మాత్రం సరైన హిట్ ఇవ్వలేకపోతున్నాడు. ఆంధ్రాపోరీతో హీరోగా మారిన ఆకాశ్ పూరీని టాలీవుడ్ ( Tollywood ) ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. దీంతో పూరీనే స్వయంగా రంగంలోకి దిగి మెహబూబా సినిమా తీసినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. ఈసారి ఎలాగైనా ఒక హిట్ ఇవ్వాలని తనదైన మాస్ యాంగిల్లో ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాడు. అయితే ఈ సారి తాను కాకుండా దర్శకత్వ బాధ్యతలను అనిల్ పాదూరికి అప్పగించాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్లో ఛార్మి ( charmi kaur )తో కలిసి రొమాంటిక్ ( Romantic ) చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన పూరీ.. స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్నాడు.
పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అన్నట్టుగా.. ఎంతోమంది నటులకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ఎందుకో తన ఫ్యామిలీ నుంచి వచ్చిన నటులను మాత్రం స్టార్లను చేయలేకపోతున్నాడు. గతంలో తన తమ్ముడు సాయిరాం శంకర్ను హీరోగా నిలబెట్టాలని పూరీ చాలానే ప్రయత్నాలు చేశాడు. 143 సినిమాతో గ్రాండ్గా టాలీవుడ్కు పరిచయం చేశాడు. కానీ ఆ సినిమా తప్ప సాయిరాంకు చెప్పుకోదగ్గ హిట్స్ రాలేవు. దీంతో ఎలాగైనా తమ్ముడికి బ్రేక్ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. రొమియో సినిమాకు కథ కూడా అందించాడు పూరీ. గోపీ గణేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. దీంతో సినిమాలు తనకు కలిసిరావని సాయిరాం శంకర్ దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు కొడుకు ఆకాశ్ను అయినా హీరోగా సక్సెస్ చేయాలని అనుకుంటున్నాడు పూరీ. కానీ ఆకాశ్ దగ్గర కూడా కలిసి రావట్లేదు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించినా ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో రొమాంటిక్ సినిమాపైనే పూర్తిగా ఫోకస్ చేశాడు పూరీ. మొదట్నుంచి సినిమా పోస్టర్లతో అంచనాలను క్రియేట్ చేసుకొచ్చిన పూరీ.. ఇటీవల ట్రైలర్తో వాటిని పెంచేశాడు. అంతేకాకుండా సినిమా ప్రమోషన్లో భాగంగా స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్నాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas )తో రొమాంటిక్ సినిమా ట్రైలర్ను లాంఛ్ చేయించాడు. ఇప్పుడు రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ను రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ( vijay devarakonda )ను రంగంలోకి దింపుతున్నాడు.
ఆకాశ్ పూరీ, కేతికా శర్మ ( ketika sharma ) నటించిన రొమాంటిక్ సినిమా ఈ నెల 29న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ నెల 22న వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్గా రంగంలోకి దింపుతున్నాడు పూరీ. ప్రస్తుతం యూత్లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ యంగ్ హీరోను రంగంలోకి దింపితే తన కొడుకు సినిమాపై ఆడియన్స్ దృష్టి పెడతారని పూరీ భావిస్తున్నాడు. మరి పూరీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వచ్చే వారం ఇద్దరు ఫ్లాప్ హీరోల పోటీ.. మరి బాక్సాఫీస్ దగ్గర గెలిచేదెవరో
Ketika Sharma | కేతిక శర్మ ‘రొమాంటిక్’ కవర్ సాంగ్ చూడాల్సిందే..వీడియో
Romantic Trailer | ఐ లైక్ దిస్ ఎనిమల్..‘రొమాంటిక్’ గా ట్రైలర్
చిరంజీవికి పూరీ జగన్నాథ్ ఇప్పుడు గుర్తుకొచ్చాడా..?
Mike Tyson Remuneration | మైక్ టైసన్ రెమ్యునరేషన్ ‘లైగర్’ కంటే ఎక్కువనా..? మేకర్స్ ఏమన్నారంటే