బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రస్తుతం టైగర్ 3 సినిమా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీంతోపాటు మరోవైపు ఫర్హద్ సామ్జీ డైరెక్షన్లో కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali) సినిమా చేస్తున్నాడు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ఇప్పటికే ఓ అప్ డేట్ కూడా తెరపైకి వచ్చింది.
కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇపుడు టాలీవుడ్ (Tollywood)లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తెలుగు హీరో విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడన్న క్రేజీ న్యూస్ ఇపుడు హాట్ టాపిక్గా మారిపోయింది. వెంకీ ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్లో ఉందని బీటౌన్ సర్కిల్ సమాచారం. సల్మాన్, వెంకటేశ్ మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ముంబైకి సమీపంలోని కర్జాత్ లో వేసిన స్పెషల్సెట్స్ లో మే 11 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోండగా..ఈ చిత్రాన్ని 90 రోజుల షెడ్యూల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. సల్మాన్, వెంకీ సిల్వర్ స్క్రీన్పై కనిపించేది నిజమే అయితే మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్ అన్నమాటే. మరి దీనిపై వెంకీ కానీ సల్లూభాయ్ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు