నటి వరలక్ష్మి శరత్కుమార్ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ముంబాయిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన నిశ్చితార్థంలో వధూవరులు కానున్న వరలక్ష్మి, నిచోలై సచ్దేవ్ ఉంగరాలు మార్చుకున్నారు.
14ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు తెలుసనీ, ఈ ఏడాదే వీరిద్దరి వివాహం జరుగనున్నదని ఇరువురి కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం కెరీర్ పరంగా వరలక్ష్మీ శరత్కుమార్ చాలా బిజీగా ఉన్నారు. క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాలీ పీఎస్, హనుమాన్ చిత్రాలతో నటిగా తెలుగునాట గొప్ప గుర్తింపునే సంపాదించుకున్నారు వరలక్ష్మీ శరత్కుమార్.