నందు, రుచిర, సుధ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్తమ కలిపురుషుడు’. సందీప్ పొడిశెట్టి దర్శకత్వం వహిస్తూ నందకిషోర్ పసుపాలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రొటీనకు భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కించిన చిత్రమిది. రొమాన్స్, ప్రేమ, వినోదం అంశాలతో రూపొందించిన ఈ చిత్రానికి ఓటీటీలో చక్కటి స్పందన లభిస్తోంది. యువతరాన్ని ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.