చెన్నై చంద్రం త్రిష ఒకప్పుడు టాలీవుడ్ని షేక్ చేసింది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి పని చేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్గా కోలీవుడ్కి చెక్కేసి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. అయితే మధ్యలో ఈ అమ్మడు నిశ్చితార్ధం చేసుకొని తర్వాత దానిని క్యాన్సిల్ చేసుకొని మళ్లీ సినిమాలతో బిజీ అయింది.
ఇటీవల త్రిష పెళ్లికి సంబంధించి జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో త్రిష మధ్యప్రదేశ్ లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేసింది. దీంతో అందరు ఆమె పెళ్లి విషయంలో చేసిందా ఏంటి అని చర్చించుకుంటున్నారు. కాని అసలు విషయం ఏంటంటే ఈ అమ్మడు మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ అనే మూవీలో నటిస్తోంది.
దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఓర్చా లొకేషన్ లో జరుగుతోంది. కార్తీ..త్రిష మీద సీన్లు ఇక్కడ తీస్తున్నారు. మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలలో చిత్రీకరిస్తున్న క్రమంలో ఓ గుడిలోను షూట్ చేశారట. త్రిష చేసిన పూజలన్ని సినిమా కోసమే తప్పించి.. వ్యక్తిగతమైనవి కావంటున్నారు