‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో త్రిష చోళ రాజ్యపు యువరాణి కుందవై పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 28న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం చెన్నైలో ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ వేడుకలో త్రిష సందడి చేసింది. ‘పొన్నియన్ సెల్వన్’ తన కెరీర్లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, రెండో భాగంలో తన పాత్ర హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో సాగుతుందని త్రిష పేర్కొంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్, జయరామ్ ప్రధాన పాత్రల్ని పోషించారు. సుభాస్కరన్ నిర్మాత. చోళుల నేపథ్య ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.