‘యానిమల్’ సినిమాతో త్రిప్తి దిమ్రి క్రేజీ హీరోయిన్గా అవతరించింది. ‘యానిమల్’లో హీరోయిన్గా చేసిన రష్మికకు ఎంత పేరు వచ్చిందో.. సెకండ్హీరోయిన్గా తక్కువ నిడివిగల పాత్ర చేసిన త్రిప్తి దిమ్రికి కూడా అంత పేరు వచ్చింది. తనకు బ్రేక్ రావడానికి కారకుడైన సందీప్రెడ్డి వంగాను పొగడ్తలతో ముంచెత్తుతున్నది త్రిప్తి డ్రిమ్రి. అంతేకాదు, రష్మికతో కలిసి నటించిన విశేషాలను, ఇంకా ‘యానిమల్’ సెట్లోని అనుభవాలను రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది త్రిప్తి. ‘నేను రణ్బీర్కపూర్కి వీరాభిమానిని. ఆయనతో నటించే ఛాన్స్ రావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను.
సెట్లోకి ఆయన రాగానే ఆయన్ను అలాగే చూస్తూ విగ్రహంలా ఉండిపోయేదాన్ని. పైగా నా సీన్స్ అన్నీ ఆయనతోనే. కాస్త స్పైసీగా చేయాల్సొస్తుందని డైరెక్టర్ సందీప్ ముందే చెప్పారు. నిజానికి కేరక్టర్ చెప్పినప్పుడు గొప్ప పాత్ర అనిపించలేదు. చేసేటప్పుడు మాత్రం ఏదో మ్యాజిక్ వర్కవుట్ అవుతున్నట్టు అనిపించింది. పైగా రణ్బీర్తో అలా నటించాల్సొచ్చినప్పుడు కాస్త భయపడ్డాను. తనే ధైర్యం చెప్పారు. తన బిహేవియర్ నాలోని భయాన్ని పోగొట్టింది. అందుకే ఆ సీన్స్ అలా వచ్చాయి. షూటింగ్ తొలి రోజుల్లో సెట్లో చాలా బిడియంగా ఉండేదాన్ని. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. నాలోని నెర్వస్నెస్ని గమనించి రష్మిక ఎక్కువ సమయం నాతోనే గడిపేది. ఈరోజున నాకింత మంచిపేరు వచ్చిందంటే వీరందరూ కారణమే’ అంటూ షూటింగ్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నది త్రిప్తి దిమ్రి.