Ugram Movie Promotions | రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలు చేసిన ఘనత అల్లరి నరేష్కే దక్కింది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేవాడు. అయితే గతకొంత కాలంగా నరేష్ సినిమాలు ప్రేక్షకులకు బోర్ కొట్టేశాయి. ముఖ్యంగా జబర్దస్త్ వంటి షోలు రావడంతో నరేష్ కామెడీని ప్రేక్షకులు అంతగా పట్టించుకోవడం లేదు. దాంతో అల్లరోడు తనను తాను కొత్తగా ఆవిష్కరిస్తూ రెండేళ్ల క్రితం ‘నాంది’తో యాక్షన్ మోడ్లోకి వచ్చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నరేష్కు తిరుగులేని గుర్తింపును, మార్కెట్ను తెచ్చిపెట్టింది. ఇక దర్శకుడిగా తొలి అడుగులోనే విజయ్ కనకమేడల విజయం సాధించాడు.
మళ్లీ రెండేళ్లకు అల్లరి నరేష్ ఆ దర్శకుడితోనే చేతులు కలిపి ‘ఉగ్రం’ సినిమా చేశాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా మే 5న రిలీజ్ కాబోతుంది. దాంతో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా గ్రాండ్గా జరిపారు. ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, అడివిశేష్, సందీప్ కిషన్, నిఖిల్ గెస్ట్లుగా వచ్చారు. కాగా ఈ యంగ్ హీరోలు ఉగ్రం మూవీ ప్రమోషన్లు వినూత్నంగా జరిపారు. ట్రెండింగ్లో ఉన్న మీమ్స్ వీడియోలను రీ క్రియేట్ చేశారు. నాంది తర్వాత నరేష్ స్క్రిప్ట్లలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే దాని మీద ఫన్నీ వీడియోలను చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Thank you my boys 🤗 @AdiviSesh @sundeepkishan @VishwakSenActor @actor_Nikhil for giving me such a fun surprise last night at #Ugram ‘s pre-release event. Reminded me of the good old “audio function” days. pic.twitter.com/vbVf1hFBbH
— Allari Naresh (@allarinaresh) May 2, 2023