సాయి మాధవ్ బుర్రా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ సహా చాలామంది హీరోలు కూడా ఈయనే కావాలని అంటున్నారు. తమ సినిమాలకు మాటలు రాయాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఆఫ్బీట్ కథలకు మాత్రమే మాటలు రాయగలడని అనుకున్నారంతా. ఫీల్ గుడ్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, మళ్లీమళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమాలలో మాటలు రాశాడు బుర్రా. అందులో ఈయన రాసిన కొన్ని డైలాగులు విన్న తర్వాత ఈయన పెన్ పవర్ ఏంటో అందరికీ అర్థమైంది. అప్పటి వరకు స్టార్ హీరోల జోలికి వెళ్లకపోయినా కూడా మొదటి సారి గోపాలా గోపాలా సినిమాలో తన స్థాయి చూపించాడు సాయి మాధవ్. అందులో పవన్ ఇమేజ్కు సరిపోయే మాటలు రాసి ఔరా అనిపించాడు. అప్పట్నుంచి బుర్రా వెంట పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ రైటర్స్ లో ఒకడిగా మారిపోయాడు సాయి మాధవ్ బుర్రా.
ఓ వైపు సైరా, శాతకర్ణి లాంటి చారిత్రాత్మక సినిమాలకు రాస్తూనే.. మరోవైపు క్రాక్, ఖైదీ నెం 150 లాంటి పక్కా కమర్షియల్ సినిమాలకు కూడా మాటలు రాస్తున్నాడు బుర్రా. ప్రస్తుతం పవన్, క్రిష్ హరిహర వీరమల్లుతో పాటు మరో అరడజన్ సినిమాలకు మాటలు రాస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే క్రాక్, శ్రీకారం సినిమాలకు ఈయనే మాటలు రాశాడు. ప్రస్తుతం సాయి మాధవ్ మాటలు రాస్తున్న సినిమాలేంటో చూద్దాం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్