Tollywood Drug case | నాలుగేళ్ల తర్వాత టాలీవుడ్ (Tollywood) లో డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టేరేట్ (Enforcement Directorate) ఎదుట హాజరుకానున్నారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) విచారణలో భాగంగా ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. 9 గంటలుగా పూరీ విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలే ప్రధానంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇవాళ సాయంత్రం ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పూరీ జగన్నాథ్ ను పలుకరిద్దామని ఇక్కడికి వచ్చానని అన్నారు. ఈడీ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. తనకు వక్కపొడి కూడా తినే అలవాటు లేదని తెలిపారు. తనకు నోటీసులెందుకు ఇస్తారని, తనకెలాంటి నోటీసులు రాలేదని బండ్లగణేశ్ చెప్పారు. ఉదయం నుంచి పూరీ జగన్నాథ్ విచారణ కొనసాగుతోందన్నారు.
బండ్ల గణేశ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ రెండు చిత్రాలు తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల విషయంలో పూరీ జగన్నాథ్ ను ప్రశ్నించగా బండ్ల గణేశ్ పేరు ప్రస్తావించడంతో ఈడీ ఆయనను కార్యాలయానికి పిలిపించి..గంటపాటు వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు వరసగా సినీ ప్రముఖులు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
మరో రీమేక్లో మెగాస్టార్ .. సొంత కథలపై చిరంజీవికి నమ్మకం పోయిందా ?
నాలుగో తరగతిలోనే ప్రేమ.. తన ఫస్ట్ క్రష్ గురించి రివీల్ చేసిన మేఘా ఆకాశ్
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్