Tollywood | ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు ఒక్కటే ధ్యాస ఉంటుంది.. తమ మార్కెట్ పెంచుకోవాలి.. త్వరగా స్టార్ హీరో అనిపించుకోవాలి అని..! దానికోసమే వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని సినిమాలు చేసినా.. ఎన్నెన్ని కొత్త ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా..! అవన్నీ వర్కవుట్ అయి స్టార్ హీరోలుగా నిలబడితే చాలు అంతే అనుకుంటారు. ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు ఇదే చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా మూకుమ్ముడిగా ఒక్కటే ప్లానింగ్తో వెళ్తున్నారు. నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు అది సక్సెస్ అయింది కూడా. మన దగ్గర 100 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. టాప్ లీగ్లో ప్రభాస్, అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్, పవన్, మహేశ్ బాబు లాంటి వాళ్లుంటారు.. వాళ్ల సినిమాలకు టాక్తో పనిలేకుండా మూడు నాలుగు రోజుల్లోనే 100 కోట్లు వచ్చేస్తున్నాయి. బ్లాక్బస్టర్ అయితే 400 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి కూడా. అయితే వాళ్ల తర్వాత ప్లేస్ కోసం చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు.
ముఖ్యంగా టైర్ 2 హీరోలలో నెంబర్ వన్ ప్లేస్ నాదంటే నాది అంటూ చాలా రోజులుగా నాని, విజయ్ దేవరకొండ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. నానికి విజయాలున్నాయి కానీ విజయ్కు మార్కెట్ ఉంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ సినిమాల హవా మొదలైన తర్వాత మీడియం రేంజ్ హీరోల ఆలోచన శైలి మారిపోయింది. వైడ్ రేంజ్ ఆఫ్ మార్కెట్ ఉన్నపుడు ఎందుకు మనం బడ్జెట్లోనే సినిమాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నారకు వాళ్లు. అదే విషయం నిర్మాతలకు చెప్పి.. భారీ బడ్జెట్ సినిమాల వైపు వె
ముందు బడ్జెట్ పెరిగితే.. హీరో రేంజ్ కూడా పెరుగుతుంది. విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ అయినా.. ఫస్ట్ డేనే 34 కోట్లు వసూలు చేసింది. అసలు ఆ రేంజ్ వసూళ్లు మామూలు సినిమాలకు అయితే వస్తాయా..? బడ్జెట్ పెరిగితే.. మార్కెట్ కూడా పెరుగుతుందనే విషయాన్ని గ్రహించారు మీడియం రేంజ్ హీరోలు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమాకు కేవలం నాన్ థియేట్రికల్ రైట్సే 50 కోట్లకు అమ్మాడయ్యాయి. దానికి కారణం ఆ సినిమా గ్రాండియరే. అలాగే ఏజెంట్ తర్వాత అఖిల్ మరో భారీ సినిమా చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది సినిమా సైతం 50 కోట్ల రేంజ్లోనే రాబోతుంది. ముందు బడ్జెట్ పెంచండి.. అది హిట్టైతే మార్కెట్ కూడా పెరుగుతుంది అంటున్నారు మన హీరోలు.