పూర్తయింది ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ (RRR) సినిమా షూటింగ్ పూర్తయింది. నాలుగేళ్లుగా సెట్స్ పైన ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహాయిస్తే త్రిబుల్ ఆర్ కు సంబంధించిన మేజర్ షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇకపై రామ్ చరణ్ (Ramcharan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
ఇతర సినిమాలు చేసుకోవచ్చు. వాళ్లకు రాజమౌళి సినిమాకు బంధం తీరిపోయింది.
మూడేళ్లుగా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలకు డేట్స్ ఇచ్చే సమయం కూడా లేదు. దానికి తోడు మధ్యలో కరోనా వైరస్ విరామం కూడా భారీగానే వచ్చింది. ఎక్కడైతే సినిమా షూటింగ్ మొదలు పెట్టాడో అక్కడే పూర్తి చేశాడు రాజమౌళి (Rajuamouli SS). ఏ షాట్ తో అయితే కొబ్బరికాయ కొట్టడో.. అదే షాట్ తీసి గుమ్మడికాయ కొట్టాడు. 2018లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడు బైక్ షాట్ తీసాడు రాజమౌళి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే షాట్ తీసి షూటింగుకు ముగింపు పలికాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికైనా మేకర్స్ అనుకుంటే అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయవచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇంత పెద్ద సినిమాను ప్రతికూల పరిస్థితుల్లో విడుదల చేస్తే అసలుకే మోసం వస్తుంది.. అందుకే కాస్త ఆలస్యంగా వచ్చిన పర్లేదు కానీ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి.
వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రమోషనల్ కార్యక్రమాలపై ఫోకస్ చేసాడు రాజమౌళి. విడుదలకు మూడు నెలల ముందుగానే మొదలు పెట్టాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. ఇందులో చరణ్, ఎన్టీఆర్ సహా అజయ్ దేవ్ గన్, అలియా భట్ లాంటి బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Chiranjeevi | బాబీ చిత్రంలో చిరంజీవి రోల్ తెలిసిపోయింది..!
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్