ఎల్బీనగర్, మే 26 : నాగోలు మూసీ బ్రిడ్జి ప్రాంతంలో సుందరీకరణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. నాగోలు మూసీ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ బ్రిడ్జి మాదిరిగానే డివైడర్కు ఇరువైపులా రెండు వర్టికల్గార్డెన్స్తో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రహదారుల గ్రిల్స్కు పెయింటింగ్ కూడా వేయించి మరింత అందంగా ముస్తాబు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు చెరుకు ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.