టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్కపూర్ తో వెబ్సిరీస్ ప్రాజెక్టుతో బిజీగా ఉంది. రాజ్-డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ సిరీస్ గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. రాశీఖన్నా మరో వెబ్ సిరీస్ కు ప్లాన్ చేస్తున్నట్టు ఓ వార్త బీటౌన్ లో చక్కర్లు కొడుతోంది. ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం సోని లివ్ రాశీఖన్నాతో వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే సోని లివ్ కు తెలుగు డిజిటల్ ప్లాట్ఫాంలో మొదటి షో కాబోతుంది. సూర్య వంగళ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. మిస్టరీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రాశీఖన్నా డిటెక్టివ్ పాత్రలో కనిపించనుంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీ షెడ్యూల్ లో ఉంది. తెలుగులో ఈ భామ నాగచైతన్యతో థ్యాంక్యూ, గోపీచంద్తో కలిసి పక్కా కమర్షియల్ లో నటిస్తోంది. తమిళంలో నాలుగు సినిమాలు, మలయాళ చిత్రం చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!