Payal Ghosh | కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మీటూ ఉద్యమంలో భాగంగా బాలీవుడ్ డైరెక్టర్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్పై మూడేండ్లుగా విమర్శలు చేస్తున్న పాయల్.. రీసెంట్గా అతనిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఛాన్స్ కోసం అనురాగ్ను కలిస్తే అతను తనపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడని బయటపెట్టింది.
బాలీవుడ్ కంటే ముందు దక్షిణాది చిత్రాల్లో నటించానని.. జాతీయ అవార్డులు పొందిన ఇద్దరు డైరెక్టర్స్తో పనిచేశానని ముందుగా పాయల్ ఘోష్ చెప్పింది. అయినప్పటికీ ఆ ఇద్దరూ తనకెంతో గౌరవం ఇచ్చారని తెలిపింది. ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడూ వ్యవహరించలేదని గుర్తుచేసుకుంది. బాలీవుడ్ విషయానికొస్తే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఎప్పుడూ కూడా అలాంటి పని చేయలేదని కామెంట్స్ చేసింది. తనను కలిసిన మూడో మీటింగ్లోనే లైంగికంగా దాడి చేశాడని బయటపెట్టింది. ఇక ఊసరవెల్లిలో ఎన్టీఆర్తో కలిసి నటించిన అనుభవాన్ని కూడా పాయల్ పంచుకుంది. ఎన్టీఆర్ ఒక జెంటిల్మెన్ అని.. ఎప్పుడూ తనతో అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది. సౌత్ గురించి అంత గొప్పగా నేను ఎందుకు చెబుతానో ఇప్పుడైనా అర్థం చేసుకోండని సూచించింది.