టాలీవుడ్ (Tollywood) లో చిరంజీవితోపాటు చాలా మంది హీరోలు తమ సినిమాల విడుదల తేదీలపై అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్న హీరో ఎవరైనా ఉన్నారా..? అంటే అది బాలకృష్ణ మాత్రమే. బోయపాటి శీను-బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అఖండ (Akhanda). సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే అఖండ చిత్రం దసరా బరిలో నిలుస్తున్నట్టు వార్తలు వచ్చినా..ఆ అవకాశం లేదని తెలిసిపోయింది.
తాజా అప్ డేట్ ప్రకారం దీపావళికి విడుదల కాబోతుందన్న వార్త తెరపైకి వచ్చింది. అయితే విడుదల తేదీని నిర్ణయించే ముందు బాలకృష్ణ థియేటర్లలో టికెట్ల ధరల సమస్యలు, ఆంధ్రప్రదేశ్లో 100 శాతం కెపాసిటీతో నాలుగు షోలు ప్రదర్శన లాంటి వాటిపైన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాడట. ఏపీలో ఇప్పటికీ 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. ఏపీ ప్రభుత్వం సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఎదురుచూస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే రిపబ్లిక్ ప్రి రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్లు తీవ్రదుమారం లేపాయి.
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నెలకొన్న టికెట్ల రేట్లు, ఇతర సమస్యలపై ఓ అంచనాకు వస్తే కానీ..బాలకృష్ణ సినిమా విడుదలపై ఓ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడని పలువురు చర్చించుకుంటున్నారు.
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన