D 50 | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఇప్పటికే అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ (Captain Miller) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమాను తెరకెక్కిస్తున్నాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. విష్ణు విశాల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోండగా.. దీనిపై ధనుష్ టీం నుండి క్లారిటీ రావాల్సి ఉంది.
తాజాగా మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. D50 ప్రాజెక్ట్లో టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తోండగా.. ఈ మూవీలో ధనుష్కు సోదరుడిగా కనిపించబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య కూడా ఇందులో కీ రోల్ చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. సందీప్ కిషన్ ఇప్పటికే కెప్టెన్ మిల్లర్లో భాగమయ్యాడు. గ్యాంగ్ స్టర్ స్టోరీ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో కాళిదాస్, దుషారా విజయన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని లీడింగ్ తమిళ చిత్ర నిర్మాత సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తుంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ఈ ఏడాది చివరలో విడుదలయే అవకాశాలున్నాయని టాక్.
Buzz about #D50:
• #SJSuryah & #SundeepKishan signed on to portray the role of brothers alongside #Dhanush 🤯🤩
• #VishnuVishal, #DusharaVijayan & #Kalidas undertaking pivotal roles 👏🏻
• The film is set against the backdrop of North Madras 🔥
• Direction: #Dhanush |… pic.twitter.com/FTlh7Ybcv4
— KARTHIK DP (@dp_karthik) May 24, 2023