నాగర్కర్నూల్ ఎంపీ రాములు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 26: అచ్చంపేట మున్సిపాలిటీలో అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ రాములు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని 16వ వార్డులో కాలనీవాసులతో మాట్లాడారు. మహిళా సంక్షేమానికి కేసీఆర్ కిట్, రైతుబంధు, బీమా, విద్యార్థులకు గురుకులాల ద్వారా మెరుగైన విద్య, సన్న బియ్యంతో నాణ్యమైన భోజనంతోపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఇంటింటికీ భగీరథ నీళ్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. మరో రెండేండ్లలో నల్లమలలో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేసి ప్రతి గుంటనూ సాగునీటితో సస్యశ్యామలం చేయనున్నట్లు గుర్తు చేశారు. అభివృద్ధి పనులు సత్వరమే పూర్తి కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో 20వార్డుల నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో 16వ వార్డు అభ్యర్థి నర్సింహాగౌడ్, జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గువ్వల అమల, కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్, మాజీ ఎంపీపీ పర్వతాలు, నాయకులు కళమ్మ, వెంకటేశ్ ఉన్నారు.
అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు: గువ్వల అమల
మున్సిపాలిటీలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయనున్నట్లు జీబీఆర్ చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గువ్వల అమల పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 16వ వార్డులో ఆమె ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మున్సిపాలిటీలోని ప్రతి కాలనీ అభివృద్ధ్ది చెందాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. 30న కారు గుర్తుకు ఓటేసి 20 వార్డుల్లోని అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.