ఈశ్వరా..పరమేశ్వరా..పవనేశ్వరా..ఈ డైలాగ్స్ ఎవరో పలికినట్టు..ఎక్కడో విన్నట్టుంది కదా. అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంటే బండ్ల గణేశ్కు చాలా ఇష్టమని తెలిసిందే. వకీల్సాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ ను పైవిధంగా పొగుడుతూ బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ అప్పట్లో ట్రెండింగ్ అయ్యాయి. అయితే ఇపుడు మరోసారి భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ (Bheemla Nayak). తెరపైకి రావడంతో ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.
అయితే ఈ సారి కూడా బండ్ల గణేశ్ స్పీచ్ (Bandla Ganesh speech) ఉండబోతుందా..? అంటే అలాంటి ఛాన్స్ ఏమీ లేదని ఫిలింనగర్ సర్కిల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది. అయితే దానిక్కారణమేమై ఉంటుందని ఆరా తీయగా..బండ్ల గణేశ్కు త్రివిక్రమ్ ()తో ఉన్న వివాదం ఒకటి ఇంకా పరిష్కారం కాలేదట. అందువల్లే భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్కు బండ్ల గణేశ్ దూరంగా ఉండబోతున్నాడని టాక్ నడుస్తోంది.
జబర్దస్త్ హైపర్ ఆది ఈ సారి బండ్ల స్థానంలో స్పీచ్ ఇవ్వబోతున్నాడట. దీన్ని బట్టి ఈ సారి పవన్ కల్యాణ్ అభిమానులు బండ్ల గణేశ్ స్పీచ్ను మిస్సవడం ఖాయమైనట్టేనని తెలుస్తోంది. అయితే బండ్లను పవన్ కల్యాణ్ ఒప్పించేంత వరకు అతడి స్పీచ్ వినడం కష్టమేనని మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు.