తెలుగు ఇండస్ట్రీపైనే ఇప్పుడు అందరి చూపు ఉంది.. ముఖ్యంగా బాలీవుడ్.. మన సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఇప్పటికే ఇక్కడ వచ్చిన కథలు నచ్చి హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టేస్తున్నారు బీటౌన్ దర్శకనిర్మాతలు. అంతేకాకుండా హిందీలో డైరెక్ట్ సినిమాలు చేసేందుకు మన దర్శకులకు రెడ్ కార్పెట్ కూడా పరుస్తున్నారు. అలా ఇప్పటికే పూరీ జగన్నాథ్, క్రిష్ వంటి దర్శకులు బాలీవుడ్ వెళ్లి సత్తా చాటగా.. ఇప్పుడు మరికొంతమంది హిందీ చిత్రసీమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..
తెలుగు స్టార్ డైరెక్టర్లలో ఒకరై వీవీ వినాయక్ ఇప్పుడు బాలీవుడ్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తొలి సినిమా ఆది (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సంపాదించుకున్న వినాయక్.. చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, బన్నీ, అదుర్స్, ఖైదీ నంబర్ 150 వంటి చిత్రాలతో తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమా రీమేక్తో బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు వీవీ వినాయక్. ఈ సినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్ను బీటౌన్కు పరిచయం చేయబోతున్నాడు. అల్లుడు శీనుతో బెల్లంకొండ శ్రీనివాస్ను టాలీవుడ్కూ వినాయక్నే పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా. తనను పాపులర్ చేసిన ఈ సినిమానే బాలీవుడ్లో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో 2019లో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా సూపర్హిట్గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్తో ఇప్పుడు హిందీలో మరో సినిమా చేయబోతున్నాడు సందీప్. రణ్బీర్ కపూర్తో యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ వంగా.
తొలి సినిమా ఘాజీ చిత్రంతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు సంకల్ప్ రెడ్డి. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రంతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు విద్యుత్ జమ్వాల్ హీరోగా ఐబీ 71 అనే స్పై థిల్లర్ చేస్తున్నాడు.
మళ్లీ రావా సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ తిన్ననూరి.. నానితో జెర్సీ సినిమా తీసి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు. జెర్సీ కథ నచ్చడంతో బాలీవుడ్ కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపించింది. షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అయిన ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరినే డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
హిట్ చిత్రంతో టాలీవుడ్లో హిట్ కొట్టాడు శైలేశ్ కొలను. ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నాడు శైలేశ్ కొలను. హిందీలో విశ్వక్సేన్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటించనున్నాడు.
తొలి సినిమాతోనే ఫర్వాలేదని అనిపించుకున్నాడు రితేశ్ రాణా. విభిన్న కథాంశంతో తెరకెక్కిన మత్తువదలరా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే సినిమాతో రితేశ్.. బీటౌన్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tollywood : అందరి దృష్టి టాలీవుడ్పైనే.. ఒక ఛాన్స్ అంటున్న ఇతర భాషల హీరోలు
సీక్రెట్ ఏజెంట్స్గా మారిపోతున్న టాలీవుడ్ హీరోలు
రాజమౌళి చదివింది ఇంటరే.. మరి త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ ఏం చదివారో తెలుసా?
పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్న బాలకృష్ణ
సల్మాన్ఖాన్కు 17 ఏళ్ల కూతురు ఉందా?