అప్పుడెప్పుడో మల్లీశ్వరీ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది కత్రినాకైఫ్. ఆ సినిమా హిట్టయినా సరే ఎందుకో కత్రినాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేవు. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేసినా అది ప్లాఫయింది.. దీంతో ముంబైకి శాశ్వతంగా మకాం మార్చిన ఈ అమ్మడు.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కత్రినా కైఫ్ ఒక్కరే కాదు.. బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న చాలామంది నటీమణులు కెరీర్ తొలినాళ్లలో సౌత్ సినీ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. వీరిలో కొంతమంది ఒకటి, రెండు చేసి అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్కి వెళ్లి సెటిలవ్వగా.. మరికొంతమంది ఇక్కడి అవకాశాలను వదులుకొని మరి బాలీవుడ్ ఆఫర్ల కోసం వెళ్లారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో నటించి బాలీవుడ్కి వెళ్లిపోయిన హీరోయిన్లు ఎవరో ఒకసారి లుక్కేద్దాం..
ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ తమిళ సినిమా ఇరువర్తో తన యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్లాల్, ప్రకాశ్రాజ్ ప్రధానపాత్రల్లో నటించారు. 1997లో విడుదలైన ఈ సినిమా ఇద్దరు పేరుతో తెలుగులోనూ అనువాదమైంది. ఆ తర్వాత జీన్స్, కందుకొండైన్ కందుకొండైన్ ( ప్రియురాలు పిలిచింది ) వంటి తమిళ సినిమాల్లో నటించింది. తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన రావోయి చందమామ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలోనూ మెప్పించింది. ఈ సినిమాలు హిట్ అయినప్పటికీ బాలీవుడ్లో అవకాశాలు రావడంతో అక్కడికే వెళ్లిపోయింది ఐశ్వర్యరాయ్.
హాలీవుడ్లోనూ సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా కూడా సౌత్ ఇండస్ట్రీ నుంచే తన కెరీర్ను మొదలు పెట్టింది. 2002లో విజయ్ హీరోగా వచ్చిన తమిళన్ సినిమాతో హీరోయిన్గా మారింది ప్రియాంక. అదే సంవత్సరం ది హీరో సినిమాతో బాలీవుడ్లోనూ అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇప్పుడు హాలీవుడ్కు షిఫ్ట్ అయింది.
దీపికా పదుకొణె కెరీర్ కూడా సౌత్ ఇండస్ట్రీ నుంచే మొదలైంది. కన్నడలో ఉపేంద్ర నటించిన ఐశ్వర్య సినిమాతో ఆమె హీరోయిన్గా మారింది. ఇది తెలుగులో నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు రీమేక్. 2006లో కన్నడలో విడుదలైన టాప్ 5 హిట్స్లోనూ నిలిచింది. అయినప్పటికీ అక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్కి వెళ్లిపోయింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడు హాలీవుడ్లోనూ ఆఫర్లు అందుకుంటుంది.
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కెరీర్ తొలినాళ్లలో టాలీవుడ్లో వరుస సినిమాలతో మెప్పించింది. మంచు మనోజ్ కథానాయకుడిగా కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ఢిల్లీ భామ. మిస్టర్ పర్ఫెక్ట్, వస్తాడు నా రాజు, షాడో వంటి వరుస సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన సౌత్ ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. దీంతో బాలీవుడ్ వెళ్లిపోయిన ఈ భామ.. అక్కడే సినిమాలు చేసుకుంటుంది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ మిషన్ ఇంపాజిబుల్ సినిమాతో టాలీవుడ్కు రీఎంట్రీ ఇస్తుంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2015లో వచ్చిన లోఫర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటానీ. కానీ ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్గా నిలిచింది. దీంతో బాలీవుడ్పై దృష్టి పెట్టింది. ఎం.ఎస్.ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్కి అడుగుపెట్టింది. తొలిసినిమాతోనే అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 1నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కృతిసనన్. ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ.. బాక్సాఫీసు దగ్గర ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ సినిమాలో నటించింది. అది కూడా హిట్ కాలేదు. దీంతో బాలీవుడ్కి వెళ్లిపోయింది. భారీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ప్రభాస్తో కలిసి పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్లో సీతగా నటిస్తోంది.
బోనీ సినిమాతో తన కెరీర్ను మొదలు పెట్టింది కృతి కర్బందా. ఆ తర్వాత తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త సినిమాల్లో నటించింది. తెలుగులో రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ.. ప్రేక్షకులకు మాత్రం చేరువ కాలేకపోయింది. దీంతో బ్రూస్లీ సినిమాలో రామ్చరణ్కు అక్కగా కూడా నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటిగా గుర్తింపు తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది కృతి కర్బందా. కానీ రెండు ఇండస్ట్రీల్లోనూ హిట్ కాలేకపోయింది. దీంతో బాలీవుడ్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది కృతి కర్బందా. అక్షయ్ కుమార్తో హౌస్ఫుల్ 4 సినిమాలోనూ నటించింది. కానీ అక్కడ కూడా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోతోంది.
దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా… తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచేసింది. ఆ తర్వాత పోకిరి, రాఖీ, జల్సా వంటి బ్లాక్బస్టర్ హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ గోవా బ్యూటీ నటించిన ఏ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు. మళ్లీ చాలా కాలానికి అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాతో హిట్ అందుకుంది. ఆ వెంటనే దేవుడు చేసిన మనుషులు సినిమాతో ఫ్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఇక్కడ వచ్చిన అవకాశాలను వదులుకుని మరి బాలీవుడ్కి వెళ్లిపోయింది. కానీ అక్కడ కూడా హీరోయిన్గా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది.. కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది.
హైదరాబాదీ అయిన టబు కూడా కూలీ నంబర్ 1 సినిమాతోనే హీరోయిన్గా మారింది. వెంకటేశ్ కథనాయకుడిగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో సూపర్హిట్గా నిలిచింది. అయినప్పటికీ తెలుగు కంటే ఎక్కువ బాలీవుడ్ సినిమాలకే మొగ్గుచూపింది టబు. కానీ వీలుచిక్కినప్పుడల్లా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉంది. నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు వంటి సినిమాలతో మెప్పించింది. ఆ తర్వాత చాలాకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరమైన టబు.. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన అల వైకుంఠపురంలో సినిమాతో టాలీవుడ్కు రీఎంట్రీ ఇచ్చింది.
కంగనా రనౌత్, కియారా అద్వాణి, ఆదాశర్మ, సుస్మితాసేన్, శిల్పాశెట్టి, అమీషా పటేల్, ప్రీతిజింటా, బిపాసా బసు, అమృతరావు వంటి కథానాయికలు కూడా కెరీర్ మొదట్లో సౌత్ సినిమాల్లో నటించిన వాళ్లే. ఇక అలనాటి తారలు శ్రీదేవి, రేఖ, జయప్రద వంటి కథానాయికలు ఇక్కడి నుంచి వెళ్లి బాలీవుడ్లో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్