ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర నటిస్తున్న తాజా చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ను శుక్రవారం బెంగళూరులో విడుదల చేశారు. త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
గుత్తా మునిప్రసన్న, ముని వెంకట చరణ్ నిర్మాతలు. హత్యకేసు పరిశోధన నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తిని పంచింది. ఉపేంద్ర మాట్లాడుతూ ‘ప్రతీ మహిళలో ఒక డిటెక్టివ్ ఉంటుంది. ఇలాంటి పాత్రలు తెరమీద అద్భుతంగా వస్తాయి. నా సతీమణి ప్రియాంక 50 చిత్రాలు పూర్తి చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.