అభిషేక్ పచ్చిపాల, నాజియా ఖాన్, వినీషా, ఇషిత ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకుడు. డా॥ ధర్మపురి ప్రకాష్ నిర్మాత. ఇటీవల టీజర్ను విడుదల చేశారు. త్వరలో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మక చిత్రమిది. టీజర్కు మంచి స్పందన వస్తున్నది. అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.