‘లేడీస్ టైలర్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు 37 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా చేయబోతున్నారు. ‘షష్టిపూర్తి’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షసింగ్ జంటగా నటిస్తున్నారు. పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ కుమార్ నిర్మాత. శనివారం చెన్నైలో ఈ సినిమా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఆర్.బి.చౌదరి క్లాప్నివ్వగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విఛాన్ చేశారు. రూపేష్కుమార్ చౌదరి మాట్లాడుతూ ‘ఇదొక న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. సంగీత ప్రధానంగా సాగుతుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. జూలైలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు ఆచ్యుత్ కుమార్, వై. విజయ, శుభలేఖ సుధాకర్ నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామిరెడ్డి, సంగీతం: ఇళయరాజా, దర్శకత్వం: పవన్ ప్రభ.